పాలస్తీనాలో ఆరోగ్య వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని, భారత్ అత్యవసర వైద్య సహాయం అందించాలని పాలస్తీనా రాయబారి అబ్దుల్లా అబు షావేష్ విజ్ఞప్తి చేశారు. గాజా, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల్లో ఆసుపత్రుల్లో అనేక కీలక మందులు పూర్తిగా కొరత ఏర్పడిందని తెలిపారు. ముఖ్యంగా క్యాన్సర్ చికిత్సకు అవసరమైన 97 రకాల మందుల్లో 50 మందులు అందుబాటులో లేవని వెల్లడించారు. వేలాది మంది రోగులు చికిత్స కోసం ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. భారత ప్రభుత్వం ప్రకటించిన ‘ఆరోగ్య మైత్రి’ కార్యక్రమాన్ని పాలస్తీనాకు కూడా విస్తరించాలని కోరారు. అంతర్జాతీయ మానవతా సహకారం అత్యవసరమని ఆయన అన్నారు.

పాలస్తీనా ఆరోగ్య రంగానికి భారత సహాయం కోరిన రాయబారి
పాలస్తీనాలో ఆరోగ్య వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని, భారత్ అత్యవసర వైద్య సహాయం అందించాలని పాలస్తీనా రాయబారి అబ్దుల్లా అబు షావేష్ విజ్ఞప్తి చేశారు. గాజా, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల్లో ఆసుపత్రుల్లో అనేక కీలక మందులు పూర్తిగా కొరత ఏర్పడిందని తెలిపారు. ముఖ్యంగా క్యాన్సర్ చికిత్సకు అవసరమైన 97 రకాల మందుల్లో 50 మందులు అందుబాటులో లేవని వెల్లడించారు. వేలాది మంది రోగులు చికిత్స కోసం ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. భారత ప్రభుత్వం ప్రకటించిన ‘ఆరోగ్య మైత్రి’ కార్యక్రమాన్ని పాలస్తీనాకు కూడా విస్తరించాలని కోరారు. అంతర్జాతీయ మానవతా సహకారం అత్యవసరమని ఆయన అన్నారు.

