స్వచ్ఛమైన, నిష్పక్షపాత ఓటరు జాబితాలు ఉన్నప్పుడే న్యాయమైన ఎన్నికలు సాధ్యమవుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ఎన్నికల సంఘం న్యాయ ప్రతినిధుల జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో బూత్ స్థాయి అధికారులు, బూత్ ఏజెంట్ల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఎన్నికల వ్యవస్థను మరింత పారదర్శకంగా, సాంకేతికంగా బలోపేతం చేయడానికి ఎన్నికల సంఘం కృషి చేస్తోందన్నారు. ఎన్నికల చట్టాలు, న్యాయపరమైన సవాళ్లు, మీడియా పాత్ర వంటి అంశాలపై సదస్సులో విస్తృతంగా చర్చించారు.

నిష్పక్షపాత ఓటరు జాబితాలే స్వేచ్ఛాయుత ఎన్నికలకు పునాది: సీఈసీ
స్వచ్ఛమైన, నిష్పక్షపాత ఓటరు జాబితాలు ఉన్నప్పుడే న్యాయమైన ఎన్నికలు సాధ్యమవుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ఎన్నికల సంఘం న్యాయ ప్రతినిధుల జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో బూత్ స్థాయి అధికారులు, బూత్ ఏజెంట్ల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఎన్నికల వ్యవస్థను మరింత పారదర్శకంగా, సాంకేతికంగా బలోపేతం చేయడానికి ఎన్నికల సంఘం కృషి చేస్తోందన్నారు. ఎన్నికల చట్టాలు, న్యాయపరమైన సవాళ్లు, మీడియా పాత్ర వంటి అంశాలపై సదస్సులో విస్తృతంగా చర్చించారు.

