ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి )
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నందు
హిందూ పురం శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ తన తల్లి బసవతారకం పేరు మీద నడుపుతూన్న క్యాన్సర్ ఆసుపత్రి ని అమరావతి లో కూడా ఏర్పాటు చేయాలనే సదుద్దేశం తో బుధవారం భూమి పూజా కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమం లో ఖమ్మం జిల్లా నందమూరి అభిమాన సంఘం నల్లమల్ల రంజిత్ వారి మిత్ర బృందం పాల్గొన్నారు. నల్లమల్ల రంజిత్ ఖమ్మం లో నడుపుతున్న అన్న క్యాంటిన్ గురించి తెలుసుకొని బాలయ్య నల్లమల్ల రంజిత్ కి అభినందనలు తెలిపారు.


