

భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి శతజయంతి ఉత్సవాల సందర్భంగా సేవా కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో నరసన్నపేట జోన్లోని పిన్నింటిపేట శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం 27 మంది పేదవారికి గొడుగులు ⛱️ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సమితి కన్వీనర్ పొట్నూరు రత్నాకర్ రావు మాట్లాడుతూ – “స్వామి చూపించిన సేవా మార్గంలో మేమంతా ముందుకు సాగుతూ, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తాం” అని తెలిపారు.కార్యక్రమంలో సమితి సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

