దుత్తలూరు మండలం నందిపాడు గ్రామ సమీపంలో శుక్రవారం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బద్వేల్ నుంచి పామూరు వైపు వెళ్తున్న మినీ వ్యాన్ ప్రయాణంలో ఉండగా ఒక్కసారిగా టైరు పగిలి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నందిపాడు వద్ద మినీ వ్యాన్ బోల్తా.. ఒకరు మృతి, 9 మందికి తీవ్ర గాయాలు
దుత్తలూరు మండలం నందిపాడు గ్రామ సమీపంలో శుక్రవారం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బద్వేల్ నుంచి పామూరు వైపు వెళ్తున్న మినీ వ్యాన్ ప్రయాణంలో ఉండగా ఒక్కసారిగా టైరు పగిలి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

