పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 4 కోట మండలం, (చెందోడు )
కోట మండలం చంద్రుడు గ్రామంలోని దళితవాడ ప్రైమరీ పాఠశాల నందు విద్యను అభ్యసించే విద్యార్థిని,విద్యార్థులు
త్రాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు.
అంగన్వాడి కేంద్రం కార్యకర్త ఈ సమస్యను ఎన్ వి రావు ఫౌండేషన్ చైర్మన్ దృష్టికి తీసుకురాగా వెంటనే చైర్మన్ ముప్పవరపు లీల మోహన్ కృష్ణ స్పందించి చంద్రుడు గ్రామంలో అంగన్వాడి కేంద్రం ఉపాధ్యాయులకు, వారి కేంద్రంలో విద్యను అభ్యసించే చిన్నారులకు దాహర్తిని తీర్చే నిమిత్తమై కూలింగ్ వాటర్ క్యాన్లు, మరియు గ్లాసులో ఉపాధ్యాయుల విద్యార్థుల సమక్షంలో ఎంవి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ పంపిణీ చేశారు.
ప్రస్తుతం వేసవి కాలంలో సీజన్ వ్యాధులు అమ్మవారు చికెన్ పాక్స్ లాంటి వ్యాధులు సోకకుండా చిన్నారులకు పెద్దలకు హోమియో మందులు పంపిణీ చేశారు.
వేసవిలోని ప్రతి సీజన్లో వారికి చల్లటి తాగునీరు అందించేందుకు ఎంవి రావు ఫౌండేషన్ ఈ కాన్లను పంపిణీ చేస్తామని అదేవిధంగా సెకండ్ బాక్స రాకుండా హోమియో మందులు చెందోడు దళితవాడలో అందజేశామని లీలా మోహన్ కృష్ణ తెలిపారు.
ఈ కార్యక్రమంలో లీలా మోహన్ కృష్ణ కార్యదర్శి ఎం విజయలక్ష్మి,అంగన్వాడి కేంద్రం ఉపాద్యాయులు రూప, కోమల,రాజేశ్వరి,ఆయాలు, విద్యార్థులు,తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.



