పున్నమి ప్రతినిధి, తిరుపతి జూలై 21
తిరుపతి టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో నిర్వహించిన సాధారణ సర్వ సభ్య సమావేశంలో తిరుపతి జిల్లా పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి,తుడా చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ ఆఫిషియో సభ్యులు, డా||డాలర్స్ దివాకర్ రెడ్డి , తిరుపతి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మీ తో కలిసి పాల్గొన్నారు.
పార్టీ సంస్థాగత బలోపేతం, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయడం వంటి అంశాలపై నాయకులు విస్తృతంగా చర్చించారు.
డా||డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని, ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ శ్రేణులు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు,పార్టీ నాయకులు, అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.

