చింత కానీ /ఖమ్మం ఆగష్టు 10
(పున్నమి ప్రతి నిధి)
చింతకాని: మండలంలోని పలు కుటుంబాలను బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు పరామర్శించారు. కోమట్లగూడెం గ్రామానికి చెందిన ఆవులూరి ప్రతాపరెడ్డి, పొద్దుటూరు గ్రామానికి చెందిన డాక్టర్ కట్ట వెంకటేశ్వర్లు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా వారి కుటుంబాలను పరామర్శించి, మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో మధిర అసెంబ్లీ కన్వీనర్ ఏలూరు నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు మందడపు సుబ్బారావు, మండల అధ్యక్షులు కొండా గోపి, కోరిపల్లి శ్రీను, చెన్నూరి నాగచారి, కొండా వెంకన్న, వేముల ఎల్లయ్య, ఉమ్మినేని లక్ష్మణరావు, రాయల వెంకటేశ్వర్లు, పెద్దిరాజు, కోయిన్ని నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.



