విశాఖపట్నం సీతంపేటలో ప్రతిష్టించబడిన శ్రీ దుర్గా గణపతి ఆలయ 33వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం 4 గంటల నుంచి లక్ష్మీ గణపతి హోమం, ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి ప్రసాద వితరణ చేసి మరలా సాయంత్రం 4 గంటల నుంచి డప్పుల దరువులతో చిన్న పిల్లల కోలాటం నడుమ మహిళలు 108 కళశాలతో సీతంపేట పుర వీధులలో స్వామి వారి ఊరేగింపు ఘనంగా సాగింది. ఈఓ శివ కేశవ రావు, చైర్మన్ నమ్మి రవి కుమార్, ధర్మకర్తలు భమిడిపాటి మల్లీశ్వరి, భీమవరపు శ్రీనివాస్ రావు, గంట్యాడ రాజేశ్వరి, లొట్ల పార్వతి, పిఠాపురపు గిరి, గుదే వేణుగోపాలరావు, చందక ఝాన్సీ, జవ్వాది శ్రీనివాస్ రావు అర్చక స్వాములు పాల్గొన్నారు.







