విశాఖపట్నం గాజువాక ( పున్నమి ప్రతినిధి):
గాజువాక రాజీవ్నగర్ సమీపంలోని రాజభోగం హోటల్ టిఫిన్ సెక్షన్గా నిర్మించిన పూరి గుడిసెలో అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు.
దీపావళి పండుగ సందర్భంగా ఎవరో వెలిగించిన తరజువ్వ గుడిసె పైకప్పుపై పడటంతో మంటలు చెలరేగినట్టు ప్రాథమిక సమాచారం. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు జరగలేదు. అయితే గుడిసె పైకప్పు పూర్తిగా దగ్ధమైపోయింది.


