కేంద్రం కీలక నిర్ణయం..125 రోజులకు పని దినాల పెంపు….
గ్రామీణ ప్రజల ఆర్థిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద గతంలో ఉన్న 100 రోజుల పని దినాలను 125 రోజులకు పెంచుతూ ‘వీబీజీ రామ్’ పథకాన్ని ప్రవేశపెట్టింది.
ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.ఈ కొత్త పథకం 2026, జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వస్తుందని, ఇది గ్రామీణ ఉపాధి కల్పనలో కీలక మలుపు అని ఆయన పేర్కొన్నారు…

