పున్నమి న్యూస్ (కోనసీమ), సీనయర్ జర్నలిస్ట్ రమణ: అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం లో మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలు మండల బీజేపీ అధ్యక్షులు యనమదల వెంకటరమణ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి వెంకటేశ్వరరావు పాల్గొని వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ విదేశీ వస్తువుల వాడకం తగ్గించి, స్వదేశీ వస్తువులు వాడదాం, భారతదేశాన్ని అభివృద్ధి చేద్దాం అని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో బుట్టే సత్యనారాయణ, నల్లా సత్తిబాబు, నల్లా మణికంఠ మరియు జనసేన యువత పాల్గొన్నారు.


