*పున్నమి న్యూస్, దొరవారిసత్రం:*
తిరుపతి జిల్లా, దొరవారిసత్రం మండలం *కుప్పారెడ్డిపాలెం గ్రామంలో* వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో అత్యంత ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామంలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
*భక్తిమయంగా గ్రామం:*
వేడుకలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ పూజా కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
వినాయకుడి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, పాడి పంటలు సమృద్ధిగా కలగాలని భక్తులు ప్రార్థించారు.
*ఫోటో:* కుప్పారెడ్డిపాలెంలో వినాయక విగ్రహం వద్ద పూజల్లో పాల్గొన్న యువకులు.
*ఇట్లు,*
*వినాయక ఉత్సవ కమిటీ, కుప్పారెడ్డిపాలెం.*


