నంద్యాల మండలం కానాల గ్రామంలోని శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో నాగులచవితి వేడుకలు వైభవంగా జరిగాయి. పర్వదినాన్ని పురస్కరించుకుని నంద్యాల పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.ఆలయ ప్రాంగణంలోని నాగేంద్రస్వామి పుట్ట వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో పాలు పోశారు. చలిమిడి, వడపప్పు తదితర నైవేద్యాలను సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. అనంతరం సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శించుకుని తమ కుటుంబాలకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ప్రసాదించాలని ప్రార్థించారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి.

కానాల సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో వైభవంగా నాగులచవితి వేడుకలు
నంద్యాల మండలం కానాల గ్రామంలోని శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో నాగులచవితి వేడుకలు వైభవంగా జరిగాయి. పర్వదినాన్ని పురస్కరించుకుని నంద్యాల పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.ఆలయ ప్రాంగణంలోని నాగేంద్రస్వామి పుట్ట వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో పాలు పోశారు. చలిమిడి, వడపప్పు తదితర నైవేద్యాలను సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. అనంతరం సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శించుకుని తమ కుటుంబాలకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ప్రసాదించాలని ప్రార్థించారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి.

