కాంగ్రెస్ప్ర భుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయినా విద్యార్థులకు పీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ హామీలను అమలు చేయలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ర్యాలీలో విద్యార్థులు, నిరుద్యోగులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు, నిరుద్యోగుల ఉపాధి కోసం బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని నాయకులు తెలిపారు. ర్యాలీలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు, ఆర్జేసీ కృష్ణ, పగడాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


