రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 6 ( పున్నమి ప్రతినిధి)
కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక కొందరు అసత్య ఆరోపణలు చేస్తున్నారని సిరిసిల్ల జిల్లా ఎస్టీ సెల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు భూక్య భాస్కర్ రాథోడ్ నాయక్ అన్నారు. ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం, ప్రజా పాలనకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరంతరం కృషి చేస్తారని తెలిపారు. ఇంద్రచౌక్లో నిర్వహించిన మహాధర్నాలో పాల్గొన్న భాస్కర్ రాథోడ్ నాయక్ ప్రజల పక్షాన గళమెత్తారు. ప్రజల కోసం.. ప్రజలతో కలిసి.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ఆదరణ చూసి ఓర్వలేకే అసత్య ఆరోపణలు
రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 6 ( పున్నమి ప్రతినిధి) కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక కొందరు అసత్య ఆరోపణలు చేస్తున్నారని సిరిసిల్ల జిల్లా ఎస్టీ సెల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు భూక్య భాస్కర్ రాథోడ్ నాయక్ అన్నారు. ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం, ప్రజా పాలనకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరంతరం కృషి చేస్తారని తెలిపారు. ఇంద్రచౌక్లో నిర్వహించిన మహాధర్నాలో పాల్గొన్న భాస్కర్ రాథోడ్ నాయక్ ప్రజల పక్షాన గళమెత్తారు. ప్రజల కోసం.. ప్రజలతో కలిసి.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.

