కడపలో స్మార్ట్ కిచెన్ కార్యక్రమానికి నీతి ఆయోగ్ ప్రశంసలు
కడప, ఆగస్టు 14: పున్నమి ప్రతినిధి: కడప జిల్లాలో పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందించేందుకు అమలు చేస్తున్న ‘స్మార్ట్ కిచెన్’ కార్యక్రమాన్ని నీతి ఆయోగ్ ప్రశంసించినట్లు సమాచారం.
సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక విధానాలను ఉపయోగించి భోజన తయారీ, నాణ్యత, పర్యవేక్షణ, పంపిణీ వ్యవస్థలను మెరుగుపరిచే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.

