Thursday, 6 August 2026
  • Home  
  • ‘ఇంటి గడప నుంచి.. ప్రజల గుండె వరకు’
- అన్నమయ్య

‘ఇంటి గడప నుంచి.. ప్రజల గుండె వరకు’

-చిట్వేలు మండలంలో ముక్కా రూపానంద రెడ్డి విస్తృత పర్యటన -కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఇంటింటి ప్రచారం -బ్రహ్మరథం పట్టిన గ్రామస్తులు.. సీఎం, డిప్యూటీ సీఎంలకు కృతజ్ఞతలు ప్రజల ఇంటి గడప నుంచి ప్రజల గుండె వరకు తెలుగుదేశం పార్టీ ప్రయాణం కొనసాగుతోందని రైల్వే కోడూరు టీడీపీ ఇన్‌చార్జ్ ముక్కా రూపానంద రెడ్డి అన్నారు. ఆయన చిట్వేలు మండలంలోని సీఎం రాచపల్లి, కేవీఆర్ పురం, నాగవరం, వడ్డీపల్లి, దేవమాచుపల్లి, పోలోపల్లి, గరుగుపల్లి గ్రామాల్లో విస్తృతంగా ‘డోర్ టు డోర్’ (ఇంటింటి ప్రచారం) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు, నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. -ప్రభుత్వ పథకాలపై అవగాహన: ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రజలతో మమేకమై, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై వారికి అవగాహన కల్పించారు. ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలను ఓపికగా విని తెలుసుకున్నారు. వాటిని వెంటనే పరిష్కరించే దిశగా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. -హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు: గ్రామాభివృద్ధికి అత్యంత కీలకమైన రహదారులు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, పెన్షన్లు తదితర మౌలిక సదుపాయాల కల్పనపై కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యల పట్ల తక్షణమే స్పందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరియు తమ కోసం నిరంతరం శ్రమిస్తున్న ముక్కా రూపానంద రెడ్డి గారికి ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు: ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు రాజు కుంట నరసింహ, సంగరాజు రవికుమార్ రాజు, ఏదోటి రాజశేఖర్ నాయుడు, ఉప్పలపాటి శివప్రసాద్ రాజు, సూర్యల ధర్మయ్య, గిరిగా నాగయ్య, రంగయ్య, పాపయ్య, ఆదినారాయణ, డాక్టర్ మహేష్ రెడ్డి, విజయ్, గరుగుపల్లి సుబ్బరాయుడు, పోలోపల్లి నారాయణ, బత్యాల ఈశ్వరయ్య, వెంకట్ సుబ్బారెడ్డి, మంద నాగేష్ లతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

-చిట్వేలు మండలంలో ముక్కా రూపానంద రెడ్డి విస్తృత పర్యటన

-కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఇంటింటి ప్రచారం

-బ్రహ్మరథం పట్టిన గ్రామస్తులు.. సీఎం, డిప్యూటీ సీఎంలకు కృతజ్ఞతలు

ప్రజల ఇంటి గడప నుంచి ప్రజల గుండె వరకు తెలుగుదేశం పార్టీ ప్రయాణం కొనసాగుతోందని రైల్వే కోడూరు టీడీపీ ఇన్‌చార్జ్ ముక్కా రూపానంద రెడ్డి అన్నారు. ఆయన చిట్వేలు మండలంలోని సీఎం రాచపల్లి, కేవీఆర్ పురం, నాగవరం, వడ్డీపల్లి, దేవమాచుపల్లి, పోలోపల్లి, గరుగుపల్లి గ్రామాల్లో విస్తృతంగా ‘డోర్ టు డోర్’ (ఇంటింటి ప్రచారం) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు, నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

-ప్రభుత్వ పథకాలపై అవగాహన:

ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రజలతో మమేకమై, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై వారికి అవగాహన కల్పించారు. ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలను ఓపికగా విని తెలుసుకున్నారు. వాటిని వెంటనే పరిష్కరించే దిశగా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన గ్రామస్తులకు భరోసా ఇచ్చారు.

-హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు:

గ్రామాభివృద్ధికి అత్యంత కీలకమైన రహదారులు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, పెన్షన్లు తదితర మౌలిక సదుపాయాల కల్పనపై కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యల పట్ల తక్షణమే స్పందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరియు తమ కోసం నిరంతరం శ్రమిస్తున్న ముక్కా రూపానంద రెడ్డి గారికి ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

-పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు:

ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు రాజు కుంట నరసింహ, సంగరాజు రవికుమార్ రాజు, ఏదోటి రాజశేఖర్ నాయుడు, ఉప్పలపాటి శివప్రసాద్ రాజు, సూర్యల ధర్మయ్య, గిరిగా నాగయ్య, రంగయ్య, పాపయ్య, ఆదినారాయణ, డాక్టర్ మహేష్ రెడ్డి, విజయ్, గరుగుపల్లి సుబ్బరాయుడు, పోలోపల్లి నారాయణ, బత్యాల ఈశ్వరయ్య, వెంకట్ సుబ్బారెడ్డి, మంద నాగేష్ లతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.