భారతదేశ స్వదేశీ ఐదో తరం యుద్ధ విమానం AMCA ప్రాజెక్ట్కు కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఈ ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేసిన మూడు కంపెనీలకు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (RFP) జారీ చేసింది.
లార్సెన్ అండ్ టుబ్రో-బెల్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, భారత్ ఫోర్జ్-బీఈఎంఎల్ కన్సార్టియాలు ఈ ప్రాజెక్ట్లో పోటీపడనున్నాయి. ఐదు ప్రోటోటైప్ యుద్ధ విమానాలను తయారు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
అధునాతన స్టెల్త్ టెక్నాలజీ, సూపర్ క్రూయిజ్ సామర్థ్యం, ఆధునిక ఆయుధ వ్యవస్థలతో ఈ విమానం రూపొందించబడనుంది. “మేక్ ఇన్ ఇండియా” కార్యక్రమంలో ఇది అత్యంత కీలక రక్షణ ప్రాజెక్ట్గా భావిస్తున్నారు.


