నేడు కుప్పంలో సీఎం ను కలిసిన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల, కళాశాల లో పని చేస్తున్న పార్ట్ టైం టీచర్స్ /లెక్చరర్స్ యూనియన్ నాయకులు.
చాలా సంవత్సరాలనుండి పని చేస్తున్న గురుకుల పార్ట్ టైం టీచర్స్ ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వ పథకాలకు అర్హులు చేయాలని, పెండింగ్ శాలరీ లు విడుదల చేయాలని, మా శ్రమకు తగిన గుర్తింపు ఇవ్వాలని వినతి పత్రం ఇవ్వగా సీఎం గారు సానుకూలంగా స్పందిచారని రాష్ట్ర నాయకులు గురురత్నం తెలిపారు. ఈ కార్యక్రమం లో నాయకులు ఆదినారాయణ రెడ్డి, ప్రవీణ్, మురగారెడ్డి, తిరుపాల్, ప్రవీణ్, గణేష్ తదితరులు పాలొగొన్నారు.



