Sunday, 20 September 2026
  • Home  
  • ఎస్‌డీహెచ్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో 208 మంది విద్యార్థులకు ఉద్యోగాలు
- ఆంధ్రప్రదేశ్ - తిరుపతి

ఎస్‌డీహెచ్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో 208 మంది విద్యార్థులకు ఉద్యోగాలు

తిరుపతి, సెప్టెంబర్‌ 20: తిరుపతి న్యూ బాలాజీ కాలనీలోని ఎస్‌డీహెచ్‌ఆర్‌ డిగ్రీ అండ్‌ పీజీ కళాశాలలో నిర్వహించిన క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌లో 208 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వివిధ ప్రముఖ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నియామక ప్రక్రియలో కళాశాలలోని పలు విభాగాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఫస్ట్‌సోర్స్‌ సొల్యూషన్స్‌, ఆటోసెన్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, పేస్‌ సెట్టర్స్‌ సంస్థలు క్యాంపస్‌ డ్రైవ్‌ను నిర్వహించాయి. ఎంపిక ప్రక్రియలో భాగంగా విద్యార్థుల ప్రతిభ, నైపుణ్యాలను పరిశీలించిన అనంతరం మొత్తం 208 మంది విద్యార్థులను ఉద్యోగ అవకాశాలకు ఎంపిక చేశారు. కళాశాల ప్రిన్సిపాల్‌ ఎ. ఉష మాట్లాడుతూ విద్యార్థులు తమ నైపుణ్యాలను నిరంతరం అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కళాశాలలో లభిస్తున్న ప్లేస్‌మెంట్‌ అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను ఆమె అభినందించారు. కళాశాల చైర్మన్‌ డి.వి.ఎస్‌. చక్రవర్తి రెడ్డి మాట్లాడుతూ నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడం కళాశాల ప్రధాన లక్ష్యమని తెలిపారు. “క్యాంపస్‌ టు కార్పొరేట్‌” లక్ష్యంతో విద్యార్థులను పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. విద్యార్థులు తమ చదువుతో పాటు ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా మంచి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని ఆయన తెలిపారు. విద్యార్థులు ఐదో సెమిస్టర్‌లో ఉండగానే ఉద్యోగ అవకాశాలు పొందడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని ప్రముఖ కంపెనీలను కళాశాల క్యాంపస్‌కు తీసుకువచ్చి విద్యార్థులకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని కళాశాల యాజమాన్యం తెలిపింది. ఉద్యోగాలకు ఎంపికైన 208 మంది విద్యార్థులకు కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు అభినందనలు తెలిపారు.

తిరుపతి, సెప్టెంబర్‌ 20: తిరుపతి న్యూ బాలాజీ కాలనీలోని ఎస్‌డీహెచ్‌ఆర్‌ డిగ్రీ అండ్‌ పీజీ కళాశాలలో నిర్వహించిన క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌లో 208 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వివిధ ప్రముఖ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నియామక ప్రక్రియలో కళాశాలలోని పలు విభాగాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.

ఫస్ట్‌సోర్స్‌ సొల్యూషన్స్‌, ఆటోసెన్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, పేస్‌ సెట్టర్స్‌ సంస్థలు క్యాంపస్‌ డ్రైవ్‌ను నిర్వహించాయి. ఎంపిక ప్రక్రియలో భాగంగా విద్యార్థుల ప్రతిభ, నైపుణ్యాలను పరిశీలించిన అనంతరం మొత్తం 208 మంది విద్యార్థులను ఉద్యోగ అవకాశాలకు ఎంపిక చేశారు.

కళాశాల ప్రిన్సిపాల్‌ ఎ. ఉష మాట్లాడుతూ విద్యార్థులు తమ నైపుణ్యాలను నిరంతరం అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కళాశాలలో లభిస్తున్న ప్లేస్‌మెంట్‌ అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను ఆమె అభినందించారు.

కళాశాల చైర్మన్‌ డి.వి.ఎస్‌. చక్రవర్తి రెడ్డి మాట్లాడుతూ నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడం కళాశాల ప్రధాన లక్ష్యమని తెలిపారు. “క్యాంపస్‌ టు కార్పొరేట్‌” లక్ష్యంతో విద్యార్థులను పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.

విద్యార్థులు తమ చదువుతో పాటు ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా మంచి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని ఆయన తెలిపారు. విద్యార్థులు ఐదో సెమిస్టర్‌లో ఉండగానే ఉద్యోగ అవకాశాలు పొందడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

భవిష్యత్తులో మరిన్ని ప్రముఖ కంపెనీలను కళాశాల క్యాంపస్‌కు తీసుకువచ్చి విద్యార్థులకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని కళాశాల యాజమాన్యం తెలిపింది. ఉద్యోగాలకు ఎంపికైన 208 మంది విద్యార్థులకు కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు అభినందనలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.