ఏఎస్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో హసనాపురం ప్రాంతంలో ప్రధాన రహదారిపై వెళ్తున్న వాహనాలను తనిఖీ నిర్వహించి వాహనదారులకు నిద్రమత్తు నుండి అప్రమత్తం అయ్యేందుకు ఏఎస్ పేట ఎస్సై జిలాని నీటితో ఫేస్ వాష్ చేయించారు.. అత్యధికంగా రెండు గంటల నుండి తెల్లవారుజాము 5 గంటల లోపు ప్రధానంగా రోడ్డుప్రమాదాలు జరుగుతూ ఉండడంతో డ్రైవర్లు నిద్రమత్తులో పోకుండా వారిని వాహనం నిలిపి నీటితో ఫేస్ వాష్ చేయించి నిద్రమత్తు పోయేలా చర్యలు చేపట్టారు. సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ నిర్వహించారు.ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్తున్నారు అనే వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఎస్సై జాగ్రత్తలు సూచించారు.. ఏఎస్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనదారులు తమ వెంట సరైన పత్రాలు ఉంచుకోవాలని సూచించారు..



