నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 21వ డివిజన్ హరే కృష్ణ నగర్లో రూ.19 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గత రెండేళ్లలో రూరల్ నియోజకవర్గంలో విస్తృత అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే తెలిపారు. 20వ డివిజన్ అభివృద్ధికి రూ.7.73 కోట్లు కేటాయించి, 74 ప్రాంతాల్లో పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సహకారంతో అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





