ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “స్వచ్ఛ ఆంధ్ర : స్వర్ణాంధ్ర” కార్యక్రమంలో చిట్వేల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరిశుభ్రత కార్యక్రమం జరిగింది. ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులు, స్కౌట్స్ & గైడ్స్ పాఠశాల ప్రాంగణంలోని పిచ్చిమొక్కలు, చెత్త తొలగించి, తడి ప్రదేశాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లారు. ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు వర్షాకాలంలో నిల్వ నీరు వలన దోమల పెరుగుదల ఎక్కువై మలేరియా, డెంగ్యూ వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని, అపరిశుభ్రమైన నీరు, ఆహారం వలన టైఫాయిడ్, పచ్చకామెర్లు వచ్చే అవకాశం ఉందని, పరిశుభ్రమైన ఆహారం, నీటిని మరిగించి తాగడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని సూచించారు. విద్యార్థులు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుతూ, గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శివ నారాయణ, నవీన్ కుమార్, వెంకటరమణ, మహమ్మద్ రఫీ, సుభాష్ చంద్రబోస్, చెన్నయ్య, గీతారాణి, హాసిని, కళావతి, శిల్పకళ, సుజాత, సోఫియా పాల్గొన్నారు.

స్వచ్ఛ ఆంధ్ర : స్వర్ణాంధ్రలో చిట్వేల్ విద్యార్థుల సేవా స్పూర్తి …..పరిశుభ్రతను పాటిద్దాం : ఆరోగ్యంగా జీవిద్దాం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “స్వచ్ఛ ఆంధ్ర : స్వర్ణాంధ్ర” కార్యక్రమంలో చిట్వేల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరిశుభ్రత కార్యక్రమం జరిగింది. ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులు, స్కౌట్స్ & గైడ్స్ పాఠశాల ప్రాంగణంలోని పిచ్చిమొక్కలు, చెత్త తొలగించి, తడి ప్రదేశాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లారు. ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు వర్షాకాలంలో నిల్వ నీరు వలన దోమల పెరుగుదల ఎక్కువై మలేరియా, డెంగ్యూ వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని, అపరిశుభ్రమైన నీరు, ఆహారం వలన టైఫాయిడ్, పచ్చకామెర్లు వచ్చే అవకాశం ఉందని, పరిశుభ్రమైన ఆహారం, నీటిని మరిగించి తాగడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని సూచించారు. విద్యార్థులు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుతూ, గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శివ నారాయణ, నవీన్ కుమార్, వెంకటరమణ, మహమ్మద్ రఫీ, సుభాష్ చంద్రబోస్, చెన్నయ్య, గీతారాణి, హాసిని, కళావతి, శిల్పకళ, సుజాత, సోఫియా పాల్గొన్నారు.

