పున్నమి న్యూస్ ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ :
24 ఏప్రిల్ 2026
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి, గ్రామానికి చెందిన కొండాపురం బాబాయ్యకు వారసత్వంగా వచ్చిన భూమి మొత్తం తన పేరు మీద ఉండడంతో తన దయాధులు ఒక ఎకరం 20 గుంటల పట్టా భూమిని రిజిస్ట్రేషన్ చేయడానికి రూ.1,30,000 ఒప్పందం కుదుర్చుకున్నారు. వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇస్తానన్న డబ్బులు ఇవ్వకపోవడంతో కలత చెంది గ్రామంలోని జియో సెల్ ఫోన్ టవర్ ఎక్కాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు గ్రామ పెద్దలు తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో రెండు గంటల అనంతరం కిందకు దిగి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.



