చిట్వేల్ మండలంలో సీపీఐ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. రైల్వేకోడూరు నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య మాట్లాడుతూ సెప్టెంబర్ 1న దిల్లీలో చేపట్టనున్న చలో దిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో పాదయాత్ర నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టి, తహసీల్దార్ నరసింహారావుకు వినతిపత్రం అందజేశారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, నిరుద్యోగం, మతోన్మాదంపై కేంద్రం విఫలమైందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.




