భూపాలపల్లి 16 ఆగస్టు (పున్నమి ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు ములుగు జిల్లాలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరై, ముఖ్యమంత్రి ప్రసంగాన్ని ఆలకించిన భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ శ్రీ బుర్ర కొమురయ్య గౌడ్ గారు.
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు బుర్ర కొమురయ్య గౌడ్ తెలిపారు.
ములుగు జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి పాల్గొన్న సభలో బుర్ర కొమురయ్య గౌడ్ ఉత్సాహంగా పాల్గొని, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలసి అభివాదం చేశారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి నాయకత్వానికి తన పూర్తి మద్దతు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
భూపాలపల్లి పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో మరింత వేగంగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్ తెలిపారు.


