మే డే మరియు సీఐటీయూ (CITU) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విశాఖ క్యాబ్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జగదాంబ సమీపంలోని సీఐటీయూ కార్యాలయంలో మంగళవారం ఒక రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి క్యాబ్ డ్రైవర్లు, కార్మికులు మరియు యువకుల నుండి విశేష స్పందన లభించింది.
ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ, పెరుగుతున్న ఇంధన ధరలు, భారీ ఫైనాన్స్ భారాలు, యాప్ కంపెనీల కమిషన్లు మరియు ఆర్టీఓ చలానాల వల్ల క్యాబ్ డ్రైవర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ తరహాలోనే ప్రభుత్వం క్యాబ్ డ్రైవర్ల కోసం సొంతంగా ఒక ప్రత్యేక యాప్ను ప్రవేశపెట్టాలని మరియు వారి సామాజిక భద్రత కోసం ప్రత్యేక ‘డ్రైవర్ల సంక్షేమ బోర్డు’ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు


