Tuesday, 8 September 2026
  • Home  
  • వినాయక మండపాలకు పోలీసు అనుమతి తప్పనిసరి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వినాయక మండపాలకు పోలీసు అనుమతి తప్పనిసరి

ఎస్ పి ఎస్ ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 8 (పున్నమి ప్రతినిధి) మనుబోలు: వినాయక చవితి సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసి విగ్రహాలు ప్రతిష్టించే వారు తప్పనిసరిగా ముందస్తు పోలీసు అనుమతి తీసుకోవాలని ఎస్సై మహమ్మద్ హానీఫ్ సూచించారు. మంగళవారం మనుబోలు పోలీస్‌స్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉత్సవ కమిటీలు ఉచిత సింగిల్‌ విండో విధానంలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మండపాల ఏర్పాటుకు స్థల యజమాని, పంచాయతీ అనుమతులతో పాటు ఫైర్, విద్యుత్‌ శాఖల నిబంధనలు పాటించాలన్నారు. రహదారులు, ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించకూడదని సూచించారు. లౌడ్‌స్పీకర్లు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే వినియోగించాలని, డీజేలు, మందుగుండు సామగ్రి నిషేధమన్నారు. నిమజ్జన సమయంలో మద్యం, మత్తు పదార్థాలు సేవిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

ఎస్ పి ఎస్ ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 8 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు: వినాయక చవితి సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసి విగ్రహాలు ప్రతిష్టించే వారు తప్పనిసరిగా ముందస్తు పోలీసు అనుమతి తీసుకోవాలని ఎస్సై మహమ్మద్ హానీఫ్ సూచించారు. మంగళవారం మనుబోలు పోలీస్‌స్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉత్సవ కమిటీలు ఉచిత సింగిల్‌ విండో విధానంలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మండపాల ఏర్పాటుకు స్థల యజమాని, పంచాయతీ అనుమతులతో పాటు ఫైర్, విద్యుత్‌ శాఖల నిబంధనలు పాటించాలన్నారు. రహదారులు, ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించకూడదని సూచించారు. లౌడ్‌స్పీకర్లు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే వినియోగించాలని, డీజేలు, మందుగుండు సామగ్రి నిషేధమన్నారు. నిమజ్జన సమయంలో మద్యం, మత్తు పదార్థాలు సేవిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.