రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కలిసి లక్నోలో ‘నౌసేనా శౌర్యవాటిక’ను ప్రారంభించారు. భారత నౌకాదళ వీరత్వం, దేశసేవా సంప్రదాయాన్ని భావితరాలకు పరిచయం చేయడమే ఈ మ్యూజియం లక్ష్యమని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఓపెన్ ఎయిర్ మ్యూజియం దేశభక్తికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్లో భారత నౌకాదళం కీలక పాత్ర పోషించిందని ఆయన ప్రశంసించారు. యువతలో దేశభక్తి భావన పెంపొందించేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.

లక్నోలో నౌకాదళ శౌర్యవాటిక ప్రారంభం
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కలిసి లక్నోలో ‘నౌసేనా శౌర్యవాటిక’ను ప్రారంభించారు. భారత నౌకాదళ వీరత్వం, దేశసేవా సంప్రదాయాన్ని భావితరాలకు పరిచయం చేయడమే ఈ మ్యూజియం లక్ష్యమని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఓపెన్ ఎయిర్ మ్యూజియం దేశభక్తికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్లో భారత నౌకాదళం కీలక పాత్ర పోషించిందని ఆయన ప్రశంసించారు. యువతలో దేశభక్తి భావన పెంపొందించేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.

