రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ వైసిపితో విబేధిస్తుంది, జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నపుడు వైసీపీ ప్రభుత్వం పై అనేక అంశాల పై పోరాటం చేశామని,కాని వైసీపీ ప్రభుత్వం చేసిన మంచి పనులను స్వాగతిస్తామని కాంగ్రెస్ పార్టీ విశాఖ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా సుందరీకరించి, బెంచీలు, డిజిటల్ క్లాస్ రూమ్స్ అలా అన్ని వసతులు కల్పించారని, వైద్య రంగంలో పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించాలనే లక్ష్యంతో తీసుకువచ్చిన 17 వైద్య కళాశలలను పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం టీడీపీ ప్రభుత్వం చేస్తోందని, వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీంబరెన్స్మెంట్ (Fees Reimbursement) పథకం తీసుకురావడంతో రాష్ట్రంలో లక్షల మంది ఇంజనీర్లు అయ్యారని దేశంలోనే అది విప్లవాత్మక నిర్ణయమని విద్య అందిస్తే కుటుంబాలు బాగుపడతాయని వై ఎస్ రాజశేఖరరెడ్డి భావించరాని. వైసీపీ హయాంలో వచ్చిన 17 వైద్య కళాశలలను పూర్తి చేసి ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తే వేల మంది పేద విద్యార్థులు డాక్టర్లు అవుతారని, పీపీపీ విధాన నిర్ణయం ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రియాంక డిమాండ్ చేసారు.


