నిడదవోలు మున్సిపల్ కార్యాలయంలో శనివారం మహాత్మా జ్యోతిరావ్ ఫూలే 200వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ తదితర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
వారు మహాత్మా జ్యోతిరావ్ ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన సమాజ సంస్కరణల కోసం చేసిన సేవలను స్మరించుకుంటూ, సమానత్వం మరియు విద్యా విస్తరణలో ఆయన చూపిన మార్గాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు.



