Monday, 27 July 2026
  • Home  
  • మనుబోలులో జనపనార సంచుల పంపిణీ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలులో జనపనార సంచుల పంపిణీ

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 19 (పున్నమి ప్రతినిధి) పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటుగా మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు ట్రస్టు సభ్యులు మనుబోలు గ్రామంలోని కోదండరాంపురంలో సుమారు 500 జనపనార సంచులను పంపిణీ చేశారు. ఈ ఏడాది విడతల వారీగా గ్రామమంతా దాదాపు 4,000 సంచులు అందజేసినట్లు ట్రస్టు సభ్యులు తెలిపారు. గత నాలుగేళ్లుగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం కొనసాగుతోందన్నారు. నిత్యావసరాలకు జనపనార సంచులనే ఉపయోగించాలని గ్రామస్తులకు సూచించారు. ఈ సేవా కార్యక్రమాన్ని అభినందించిన గ్రామస్తులు శ్రీనాథ్ రెడ్డి, ట్రస్టు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు, కోదండరాంపురం వాసులు పాల్గొన్నారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 19 (పున్నమి ప్రతినిధి)
పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటుగా మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు ట్రస్టు సభ్యులు మనుబోలు గ్రామంలోని కోదండరాంపురంలో సుమారు 500 జనపనార సంచులను పంపిణీ చేశారు. ఈ ఏడాది విడతల వారీగా గ్రామమంతా దాదాపు 4,000 సంచులు అందజేసినట్లు ట్రస్టు సభ్యులు తెలిపారు. గత నాలుగేళ్లుగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం కొనసాగుతోందన్నారు. నిత్యావసరాలకు జనపనార సంచులనే ఉపయోగించాలని గ్రామస్తులకు సూచించారు. ఈ సేవా కార్యక్రమాన్ని అభినందించిన గ్రామస్తులు శ్రీనాథ్ రెడ్డి, ట్రస్టు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు, కోదండరాంపురం వాసులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.