ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 2 ( మల్లికార్జునరావ్ పున్నమి ప్రతినిధి).మనుబోలు మండలం జట్లకొండూరులో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో టిడిపి నాయకుడు వెందోటి భాస్కర్ రెడ్డి తనపై వచ్చిన భూఆక్రమణ ఆరోపణలను ఖండించారు. దళితుల భూములను తాను ఆక్రమించలేదని స్పష్టం చేశారు. 1981లో తన అత్తగారి పేరిట సర్వే నంబర్ 33లో ఎకరా 12 సెంట్ల భూమి పొందినట్లు, అప్పట్లోనే డిటి రిజిస్ట్రేషన్ జరిగిందని తెలిపారు. 1986లో 23 మంది దళితులకు ఇచ్చిన పట్టాలు వారు అప్పుడే విక్రయించుకున్నారని అన్నారు. గుడి నారమ్మకు ఇచ్చిన 72 సెంట్ల భూమి కూడా అమ్ముడైందని చెప్పారు. సంబంధిత డాక్యుమెంట్లను మీడియాకు చూపిస్తూ, ఆధారాలతోనే మాట్లాడాలని సూచించారు.

భూఆక్రమణ ఆరోపణలు ఖండించిన భాస్కర్ రెడ్డి.
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 2 ( మల్లికార్జునరావ్ పున్నమి ప్రతినిధి).మనుబోలు మండలం జట్లకొండూరులో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో టిడిపి నాయకుడు వెందోటి భాస్కర్ రెడ్డి తనపై వచ్చిన భూఆక్రమణ ఆరోపణలను ఖండించారు. దళితుల భూములను తాను ఆక్రమించలేదని స్పష్టం చేశారు. 1981లో తన అత్తగారి పేరిట సర్వే నంబర్ 33లో ఎకరా 12 సెంట్ల భూమి పొందినట్లు, అప్పట్లోనే డిటి రిజిస్ట్రేషన్ జరిగిందని తెలిపారు. 1986లో 23 మంది దళితులకు ఇచ్చిన పట్టాలు వారు అప్పుడే విక్రయించుకున్నారని అన్నారు. గుడి నారమ్మకు ఇచ్చిన 72 సెంట్ల భూమి కూడా అమ్ముడైందని చెప్పారు. సంబంధిత డాక్యుమెంట్లను మీడియాకు చూపిస్తూ, ఆధారాలతోనే మాట్లాడాలని సూచించారు.

