పత్రిక ప్రకటన
నేడు అనగా తేది.04.06.2026న భువనగిరి పట్టణంలోని వివిధ వార్డులలో నిర్వహించబడుతున్న వార్డు సభ కార్యక్రమములలో భాగంగా వార్డు నం.12, 13లలో ముఖ్యఅతిథిగా *గౌరవ చైర్ పర్సన్ శ్రీమతి తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ గారు* విచ్చేయగా శ్రీయుత మున్సిపల్ కమిషనర్ శ్రీ కే చంద్ర ప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు స్థానిక గౌరవ వార్డు సభ్యులు శ్రీమతి తోటకూర విజయలక్ష్మి వెంకటేష్ గారు, శ్రీమతి గుర్రాల సంతోష శ్రీనివాస్ గార్ల అధ్యక్షతన *ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ముగింపు కార్యక్రమంలో* పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా గౌరవ చైర్ పర్సన్ గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన ఇట్టి ముగింపు సభలలో పట్టణ ప్రజలకు సాలిడ్ వెస్ట్ మేనేజిమెంట్ రూల్స్, 2026, జల్ సంచయ్ – జల్ భగీరత పథకం క్రింద ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టుట, మురికి కాలువల శుభ్రం చేయుట మరియు పూడిక తీయు పనులు, వర్షాకాల సంసిద్ధత పై కార్యాచరణ ప్రణాళిక, మంచి నీటి సరఫరా మరియు నిర్వహణ, నీరు నిలువ ప్రాంతాల నివారణ మరియు పారిశుద్ధ్యం, రోడ్ల నిర్వహణ మరియు వీది దీపాలు, మొక్కలు మరియు పర్యావరణ సంరక్షణ కార్యక్రమములు మరియు ఫిర్యాదుల పరిష్కారం వంటి పలు అంశాలపై అవగాహన కల్పించుటకు గాను వార్డు సభలలో చర్చించ వలసిన అవసరం ఉన్నదని. ప్రజలందరూ కూడా ఇట్టి విషయాలలో అవగాహన పెంచుకొని ఇట్టి పనులను వార్డులలో చేపట్టాలని సూచించారు. అంతేకాకుండా ఇట్టి నాలుగు రోజులలో షెడ్యూల్ ప్రకారం ప్రతి రోజు 10 వార్డుల చొప్పున మరియు చివరి రోజున 5 వార్డులలో వార్డు సభలు నిర్వహించవబడుతాయని తెలిపారు.
ఇట్టి కార్యక్రమంలో గౌరవ కౌన్సిల్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, వార్డు అధికారులు, మహిళా సంఘాల వారు, వార్డు ప్రజలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




