హైదరాబాద్లోని రామభక్ష బండ బంగారు మైసమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు అందజేశారు. ప్రత్యేక పూజల అనంతరం ఆయన మాట్లాడుతూ.. మన సంస్కృతీ సంప్రదాయాలకు బోనాలు ప్రతీకగా నిలుస్తాయని అన్నారు. ఆలయాభివృద్ధికి రూ.20 లక్షలు కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఉత్సవాలను ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తోందన్నారు.
Uploaded Video:

