బెంగళూరులో వీధి కుక్కలకు ఆహారం అందించే బృహత్ బెంగళూరు మహానగర పాలికె ప్రతిష్టాత్మక పథకం నిలిచిపోయింది. నగర పాలక సంస్థ పునర్వ్యవస్థీకరణ అనంతరం ఈ ప్రణాళికను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.
2025లో ప్రారంభించిన ఈ పథకం ప్రకారం వీధి కుక్కలకు నిర్దిష్ట ప్రాంతాల్లో ఆహారం అందించాలనుకున్నారు. అయితే చికెన్ రైస్, బిర్యానీ వివాదంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో అధికారులు వెనక్కి తగ్గినట్లు సమాచారం. ప్రస్తుతం కుక్కల జనాభా నియంత్రణ, శస్త్రచికిత్సలపై దృష్టి సారిస్తున్నారు.
జంతు సంక్షేమ నిబంధనల ప్రకారం వీధి కుక్కలకు ఆహారం అందించడం స్థానిక సంస్థల బాధ్యత అని నిపుణులు చెబుతున్నారు. ఈ పథకం నిలిచిపోవడంతో జంతు ప్రేమికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో మార్పులతో ఈ పథకాన్ని మళ్లీ ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.


