07-06-2020 బుచ్చిరెడ్డిపాలెం (పున్నమి విలేఖరి – జి.పి.ప్రవీణ్) బుచ్చిరెడ్డిపాలెం మండలం లోని కనిగిరి రిజర్వాయర్ నందు జాలరు చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. కనిగిరి రిజర్వాయర్ నందు చేపల వేటే వృత్తిగా ఎంచుకొని జీవనం సాగిస్తూ ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇందులో భాగంగానే చంద్రయ్య(45) అనే ప్రకాశం జిల్లా పెద్దగంజాం గ్రామం వాసి వేటకు వెళ్ళాడు. ఇతను సంవత్సరంలో మూడు నెలలు ఇక్కడ చేపలవేట కొనసాగించేవాడు. ఈ నేపధ్యంలోనే శుక్రవారం రోజు చేపల వేటకు బయలు దేరి ప్రమాదవశాత్తు రిజర్వాయర్లో పడి మృతిచెందాడు. అటుగా వెళ్ళిన మరొక జాలరి మృతదేహాన్ని చూసి ఒడ్డున ఉండే వారికి సమాచారం అందించగా అందరూ కలసి వెళ్లి మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకువచ్చారు. ఈ సమాచారం అందుకున్న బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు మృతికి గల కారణాలను ప్రాథమిక అంచనా వేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
బుచ్చిరెడ్డిపాలెం లోని కనిగిరి రిజర్వాయర్ లో ప్రమాదవశాత్తు జాలరు మృతి.
07-06-2020 బుచ్చిరెడ్డిపాలెం (పున్నమి విలేఖరి – జి.పి.ప్రవీణ్) బుచ్చిరెడ్డిపాలెం మండలం లోని కనిగిరి రిజర్వాయర్ నందు జాలరు చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. కనిగిరి రిజర్వాయర్ నందు చేపల వేటే వృత్తిగా ఎంచుకొని జీవనం సాగిస్తూ ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇందులో భాగంగానే చంద్రయ్య(45) అనే ప్రకాశం జిల్లా పెద్దగంజాం గ్రామం వాసి వేటకు వెళ్ళాడు. ఇతను సంవత్సరంలో మూడు నెలలు ఇక్కడ చేపలవేట కొనసాగించేవాడు. ఈ నేపధ్యంలోనే శుక్రవారం రోజు చేపల వేటకు బయలు దేరి ప్రమాదవశాత్తు రిజర్వాయర్లో పడి మృతిచెందాడు. అటుగా వెళ్ళిన మరొక జాలరి మృతదేహాన్ని చూసి ఒడ్డున ఉండే వారికి సమాచారం అందించగా అందరూ కలసి వెళ్లి మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకువచ్చారు. ఈ సమాచారం అందుకున్న బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు మృతికి గల కారణాలను ప్రాథమిక అంచనా వేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.