బీజేపీలోకి కొత్తవలస సీనియర్ న్యాయవాది, మాజీ ప్రభుత్వ న్యాయవాది గొడుగుల మహేంద్ర
విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ, సెప్టెంబర్ 14 పున్నమి ప్రతినిధి
కొత్తవలస: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారి సమక్షంలో కొత్తవలసకు చెందిన పలువురు ప్రముఖులు భారతీయ జనతా పార్టీలో చేరారు.
కొత్తవలస సీనియర్ న్యాయవాది, మాజీ ప్రభుత్వ న్యాయవాది గొడుగుల మహేంద్ర, అడ్వకేట్ పి. కనకారావు, వ్యాపారవేత్త కొల్లా కృష్ణతో పాటు పలువురు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ కొత్తవలస మండల అధ్యక్షుడు ఆల్తి అశోక్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు చొక్కాకుల అప్పారావు, డాక్టర్ జగదీశ్వరి, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఎస్. త్రినాథ్, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ టి. రాము, సీనియర్ నాయకులు పట్నాల శ్రీనివాసరావు, మల్ల శ్రీనివాసరావు, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
కొత్తగా పార్టీలో చేరిన నాయకులకు బీజేపీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. వారి చేరికతో కొత్తవలస మండలంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని నాయకులు పేర్కొన్నారు.


