*చిన్నారుల నృత్య ప్రదర్శనలను అభినందించిన మంత్రి జూపల్లి కృష్ణారావు మరియు ఉన్నతాధికారులు*
*పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్:: తేదీ::03 /06/2026 జిల్లా*
*”మన పాఠశాల” అనే గేయ రచయిత తిరుమల నాగేంద్ర కుమార్, రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎమ్ ఎన్ విజయకుమార్ గారి సహాయ సహకారాలతో గాయకుని ద్వారా పాడిన పాటను,ఇటీవల జిల్లా కలెక్టర్ శ్రీమతి ఖుష్బూ గుప్తా గారు సిడి ఆవిష్కరణ సందర్భంగా ప్రశంసించడం జరిగింది, అందుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో వల్లూరు పాఠశాల చిన్నారుల నృత్యం, స్థానిక మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమానికి అతిథిగా వచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావు గారు అభినందించారు మరియు వీరితో పాటు జిల్లా కలెక్టర్ మరియు ఉన్నతాధికారులు చిన్నారులను గేయ రచయిత తిరుమల నాగేంద్ర కుమార్ ను అభినందించారు, ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య కార్పొరేట్ మించి సౌకర్యాలు ఉన్నందున తల్లిదండ్రులు ప్రజాప్రతినిధులు ఆ దిశగా ఆలోచించి వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులంతా అత్యుత్తమ ప్రతిభ గలవారని కావున ఆ దిశగా ఆలోచించి ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు*


