పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 4 చిట్టమూరు మండలం,
మల్లం సెక్టార్ నందు కోగిలి పంచాయతీ పేరిటలమిట్ట అంగన్వాడి కేంద్రంలో సిడిపిఓ ముని కుమారి ఆదేశాల మేరకు సూపర్వైజర్ కవిత ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాలు వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు.
ఈ సమావేశంలో సూపర్వైజర్ కవిత తల్లిపాలు యొక్క ప్రాముఖ్యతను వివరించారు.
తల్లిపాలు తల్లిపాలు బిడ్డకు మొట్టమొదటి వ్యాధి నిరోధక అనే తెలిపారు.
తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారం అని తెలిపారు.
ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టాలని తెలిపారు.
ఈ సమావేశంలో అంగనవాడి కార్యకర్తలు, సరోజనమ్మ, రాజమ్మ, బాలమణి, పార్వతి, సుశీలమ్మ, హెల్పర్ చెల్లమ్మ, తల్లులు ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.



