కడప రిమ్స్ హాస్పిటల్ వద్ద దివంగత మాజీ ఎమ్మెల్యే కందుల శివానందరెడ్డి జ్ఞాపకార్థం ప్రతి మంగళ, శుక్రవారాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కందుల విద్యాసంస్థల అధినేత డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సేవలు జరుగుతున్నాయి. 2020 నవంబర్లో తన తండ్రి మరణించారని, ఆయన స్మృత్యర్థం 2024 నవంబర్ నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ప్రతి వారం సుమారు 1000 భోజన పొట్లాలు, మనిషికి రెండు వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. రిమ్స్ మార్చురీ వార్డు సమీపంలోని మెంటల్ రీహాబిలిటేషన్ సెంటర్లో ఉన్న 70 మందికి అదనంగా భోజనాలు అందిస్తున్నారు. ఈ సేవా కార్యక్రమంలో కందుల విద్యాసంస్థల విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొని ప్యాకింగ్, వితరణలో సహాయం అందిస్తున్నారు.

పేదలకు అన్నదానం కార్యక్రమం నిర్వహణ
కడప రిమ్స్ హాస్పిటల్ వద్ద దివంగత మాజీ ఎమ్మెల్యే కందుల శివానందరెడ్డి జ్ఞాపకార్థం ప్రతి మంగళ, శుక్రవారాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కందుల విద్యాసంస్థల అధినేత డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సేవలు జరుగుతున్నాయి. 2020 నవంబర్లో తన తండ్రి మరణించారని, ఆయన స్మృత్యర్థం 2024 నవంబర్ నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ప్రతి వారం సుమారు 1000 భోజన పొట్లాలు, మనిషికి రెండు వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. రిమ్స్ మార్చురీ వార్డు సమీపంలోని మెంటల్ రీహాబిలిటేషన్ సెంటర్లో ఉన్న 70 మందికి అదనంగా భోజనాలు అందిస్తున్నారు. ఈ సేవా కార్యక్రమంలో కందుల విద్యాసంస్థల విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొని ప్యాకింగ్, వితరణలో సహాయం అందిస్తున్నారు.

