*పెండింగ్ వ్యవసాయ సర్వీసులను వెంటనే మంజూరు చేయాలి*
*సిబ్బంది వారికి కేటాయించిన హెడ్ క్వార్టర్స్ నివాసం ఉండాలి*
*యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర యాప్ లో విద్యుత్ ఉద్యోగులందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి*
*కలెక్టర్ గారి ఆదేశాలు సారం యోగా ప్రత్యేక కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగులందరూ పాలుపంచుకోవాలి*
*ఉద్యోగులపై ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తప్పవు*
*విద్యుత్ సేవలపై ప్రజల్లో సంతృప్తి స్థాయిని పెంచాలి*
ఈరోజు జిల్లాలోని ఇంజనీరింగ్ అధికారులు మరియు అకౌంట్స్ విభాగపు అధికారులతో జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ వి.విజయన్ గారు ప్రత్యేక టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించడం జరిగింది.
ఎస్.ఈ. గారు మాట్లాడుతూ ఈ టెలీకాన్ఫెరెన్స్ ముఖ్యఉద్దేశం పెండింగ్ లో ఉన్న వ్యవసాయ సర్వీసులను యుద్ధ ప్రాతిపదికన రిలీజ్ చేయాలి. వ్యవసాయ సర్వీసెస్ రిలీజ్ లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని తెలియచేసారు.
సిబ్బంది వారికి కేటాయించిన హెడ్ క్వార్టర్స్ లోనే ఉండాలని అలా ఉండని వారు వెంటనే హెడ్ క్వార్టర్స్ లో నివాసం ఉండాలని తెలిపారు.
వచ్చే నెల 21న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర యాప్ ద్వారా విద్యుత్ ఉద్యోగులందరూ రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని అధికారులు వారి పరిధిలోని ఉద్యోగులకు అవగాహన కల్పించాలని తెలియజేశారు మరియు జిల్లాలో జరిగే యోగ ప్రత్యేక కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగులందరూ పాలుపంచుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ యోగా దినోత్సవం లో ప్రతి ఒక్క విద్యుత్ ఉద్యోగి తన వంతుగా ఈ కార్యక్రమాలలో పాల్గొనాలని మరియు రిజిస్ట్రేషన్లు తప్పనిసరిగా చేసుకోవాలని తెలిపారు.
లో వోల్టేజ్, ట్రాన్స్ఫార్మర్ల సరఫరా మరియు విద్యుత్ పనులు తదితర సమస్యలపై తక్షణమే స్పందించి ప్రజల్లో విద్యుత్ సంస్థ పై సంతృప్తి స్థాయిని పెంచాలని తెలిపారు. చెట్ల కొమ్మలు తొలగింపు, లైన్ మెయింటెనెన్స్ పనులు చేస్తున్నప్పుడు అధికారులు ప్రత్యక్షంగా అక్కడే ఉండాలని అప్పుడే ప్రజల్లో నమ్మకం కలుగుతుందని తెలిపారు, విద్యుత్ సేవలపై ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరగాలని సమస్యలు పరిష్కరించం లేదన్న ఫిర్యాదులు వస్తే కఠినంగా వ్యవహరిస్తానని తెలిపారు. ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని అలసత్వం ప్రదర్శించవద్దని అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పని హెచ్చరించారు.