Saturday, 16 May 2026
  • Home  
  • పిట్టలదొరను తలపించిన జగన్ గూగుల్ డేటా సెంటర్ వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా గంటా విమర్శ
- విశాఖపట్నం

పిట్టలదొరను తలపించిన జగన్ గూగుల్ డేటా సెంటర్ వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా గంటా విమర్శ

జగన్మోహన్ రెడ్డి గారు భ్రమ యుగంలో విహరిస్తూ రాష్ట్ర ప్రజలకు పిట్టల దొరను.. కొమ్మ దాసరి వాడిని.. గుర్తుకు తెస్తున్నారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ప్రకటించి దాదాపు రెండు నెలలు గడిచిన తర్వాత ఆయన గాఢ నిద్రలో నుంచి లేచి ఆ ప్రాజెక్టు ముమ్మాటికీ తాను వేసిన విత్తనమే అంటూ ఈరోజు చేసిన హంగామా జబర్దస్త్ స్కిట్ ను తలపించింది. “అదానీకి, గూగుల్ కు వ్యాపార సంబంధాలున్నాయి.. వైసీపీ హయాంలో అదానీ డేటా సెంటర్ వచ్చింది.. దాని కొనసాగింపే గూగుల్ డేటా సెంటర్.. ఈ ప్రాజెక్టులో అదానీ రూ.87 వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నారు.. అదానీ డేటా సెంటర్ నిర్మించి గూగుల్ కు అప్పగిస్తారు.. అదానీకి థాంక్స్ చెప్పండి.. వైసీపీకి క్రెడిట్ ఇవ్వడం ఇష్టం లేక సీఎం చంద్రబాబు నాయుడు విషయాలన్నీ దాస్తున్నారు..” అంటూ ఏవేవో చెప్పి ప్రజలకు ఉచిత వినోదాన్ని పంచారు. డేటా సెంటర్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదంటూ నిన్నటి వరకూ గోబెల్స్ ప్రచారం చేసిన బ్లూ మీడియా జగన్మోహన్ రెడ్డి యూ టర్న్ మాటలతో విశాఖకు గూగుల్ తో పాటు టీసీఎస్.. కాగ్నిజెంట్.. యాక్సెంచర్.. సత్వా.. సిఫీ.. వంటి అంతర్జాతీయ ఐటీ కంపెనీలు కూడా వైసీపీ తెచ్చిందేనంటూ ప్రచారం మొదలుపెట్టినా ఆశ్చర్యపొనక్కర్లేదు

జగన్మోహన్ రెడ్డి గారు భ్రమ యుగంలో విహరిస్తూ రాష్ట్ర ప్రజలకు పిట్టల దొరను.. కొమ్మ దాసరి వాడిని.. గుర్తుకు తెస్తున్నారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ప్రకటించి దాదాపు రెండు నెలలు గడిచిన తర్వాత ఆయన గాఢ నిద్రలో నుంచి లేచి ఆ ప్రాజెక్టు ముమ్మాటికీ తాను వేసిన విత్తనమే అంటూ ఈరోజు చేసిన హంగామా జబర్దస్త్ స్కిట్ ను తలపించింది. “అదానీకి, గూగుల్ కు వ్యాపార సంబంధాలున్నాయి.. వైసీపీ హయాంలో అదానీ డేటా సెంటర్ వచ్చింది.. దాని కొనసాగింపే గూగుల్ డేటా సెంటర్.. ఈ ప్రాజెక్టులో అదానీ రూ.87 వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నారు.. అదానీ డేటా సెంటర్ నిర్మించి గూగుల్ కు అప్పగిస్తారు.. అదానీకి థాంక్స్ చెప్పండి.. వైసీపీకి క్రెడిట్ ఇవ్వడం ఇష్టం లేక సీఎం చంద్రబాబు నాయుడు విషయాలన్నీ దాస్తున్నారు..” అంటూ ఏవేవో చెప్పి ప్రజలకు ఉచిత వినోదాన్ని పంచారు. డేటా సెంటర్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదంటూ నిన్నటి వరకూ గోబెల్స్ ప్రచారం చేసిన బ్లూ మీడియా జగన్మోహన్ రెడ్డి యూ టర్న్ మాటలతో విశాఖకు గూగుల్ తో పాటు టీసీఎస్.. కాగ్నిజెంట్.. యాక్సెంచర్.. సత్వా.. సిఫీ.. వంటి అంతర్జాతీయ ఐటీ కంపెనీలు కూడా వైసీపీ తెచ్చిందేనంటూ ప్రచారం మొదలుపెట్టినా ఆశ్చర్యపొనక్కర్లేదు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.