రాష్ట్ర పురపాలక పట్టనాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పి.నారాయణ ఆలోచనల మేరకు నెల్లూరు నగరం పరిధిలోని ఏడు ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
వాటిలో ఐదు కూడళ్లలో ఇప్పటికే సిగ్నలింగ్ వ్యవస్థ పనిచేస్తోంది. రెండు ప్రాంతాల్లో కొన్ని సాంకేతిక కారణాలు, రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను అమలు చేయలేకపోయారు.
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ ఆదేశాల మేరకు శనివారం ఇంజనీరింగ్, ట్రాఫిక్ విభాగం, ఇరిగేషన్ విభాగాల అధికారులు సంయుక్తంగా రెండు కూడళ్లలో సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎలక్ట్రికల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ముజాహిద్దీన్, ఏ.ఈ ఫహీమ్, ఇరిగేషన్ ఏ.ఈ రాజశేఖర్, ట్రాఫిక్ సి.ఐ జగన్ మోహన్ పాల్గొన్నారు.

నెల్లూరు నగర ట్రాఫిక్ వ్యవస్థ బలోపేతానికి మరో ముందడుగు
రాష్ట్ర పురపాలక పట్టనాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పి.నారాయణ ఆలోచనల మేరకు నెల్లూరు నగరం పరిధిలోని ఏడు ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వాటిలో ఐదు కూడళ్లలో ఇప్పటికే సిగ్నలింగ్ వ్యవస్థ పనిచేస్తోంది. రెండు ప్రాంతాల్లో కొన్ని సాంకేతిక కారణాలు, రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను అమలు చేయలేకపోయారు. నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ ఆదేశాల మేరకు శనివారం ఇంజనీరింగ్, ట్రాఫిక్ విభాగం, ఇరిగేషన్ విభాగాల అధికారులు సంయుక్తంగా రెండు కూడళ్లలో సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎలక్ట్రికల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ముజాహిద్దీన్, ఏ.ఈ ఫహీమ్, ఇరిగేషన్ ఏ.ఈ రాజశేఖర్, ట్రాఫిక్ సి.ఐ జగన్ మోహన్ పాల్గొన్నారు.

