రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ జులై 22 ( పున్నమి ప్రతినిధి)
రాజన్న సిరిసిల్ల జిల్లా, ముస్తాబాద్ మండలం, నామాపూర్ గ్రామంలో వడ్డెర సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గ్రామంలోని వడ్డెర సంఘ సభ్యులు సమావేశమై సంఘ అభివృద్ధి, ఐక్యత మరియు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా శివరాత్రి రాజు, ఉపాధ్యక్షుడిగా కొద్దుల క్రాంతి కుమార్, క్యాషియర్గా పల్లపు వేణు, రైటర్గా కొద్దుల నవీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ, వడ్డెర సంఘ అభివృద్ధి కోసం సభ్యులందరినీ కలుపుకొని పనిచేస్తామని, గ్రామంలో సంఘ ఐక్యతను మరింత బలోపేతం చేస్తూ ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తామని తెలిపారు. గ్రామ పెద్దలు, సంఘ సభ్యులు నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి నాయకత్వంలో సంఘం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.


