పున్నమి హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వార్డు సభ్యుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం నాగులపల్లి గ్రామానికి చెందిన 3వ వార్డు మెంబర్ దూపం అంజనేయులు వారిని యమిస్తూ హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో తెలంగాణ రాష్ట్ర వార్డు సభ్యుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు అందే బీరన, రాష్ట్ర అధ్యక్షులు న్యాయవాది అతికం రాజశేఖర్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేసి నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డు సభ్యుల సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. తమ నియామకానికి కృషిచేసిన రాష్ట్ర కమిటీ సభ్యులకు లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుముల నవీన్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి సందరగిరి వెంకటేష్, రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల సాంబయ్య గౌడ్ , ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మూల కరుణాకర్ గౌడ్, రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గంగాధర గంగజమున వెంకటరమణ, రాష్ట్ర నాయకులు బత్తిని అనిల్, దొబ్బటి శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.






