కాకినాడ, కిర్లంపూడి, పున్నమి ప్రతినిధి,సెప్టెంబర్ 16:
జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం రామచంద్రాపురం గ్రామంలో జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో యువసేన యూత్ నైట్ వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది.
తుమ్మలపల్లి రమేష్ స్వయంగా టోర్నమెంట్ను ప్రారంభించి క్రీడాకారులను ప్రోత్సహించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు ఈ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.టోర్నమెంట్లో ప్రథమ బహుమతిగా రూ.15,000, ద్వితీయ బహుమతిగా రూ.10,000 నగదు బహుమతులతో పాటు ట్రోఫీలను తుమ్మలపల్లి రమేష్ అందించనున్నారు. ఈ సందర్భంగా రమేష్ క్రీడాకారులను అభినందించి, క్రీడా పోటీలను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు యువసేన యూత్ సభ్యులు క్రీడాకారులు పాల్గొన్నారు

తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి నెట్ వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం
కాకినాడ, కిర్లంపూడి, పున్నమి ప్రతినిధి,సెప్టెంబర్ 16: జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం రామచంద్రాపురం గ్రామంలో జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో యువసేన యూత్ నైట్ వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. తుమ్మలపల్లి రమేష్ స్వయంగా టోర్నమెంట్ను ప్రారంభించి క్రీడాకారులను ప్రోత్సహించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు ఈ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.టోర్నమెంట్లో ప్రథమ బహుమతిగా రూ.15,000, ద్వితీయ బహుమతిగా రూ.10,000 నగదు బహుమతులతో పాటు ట్రోఫీలను తుమ్మలపల్లి రమేష్ అందించనున్నారు. ఈ సందర్భంగా రమేష్ క్రీడాకారులను అభినందించి, క్రీడా పోటీలను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు యువసేన యూత్ సభ్యులు క్రీడాకారులు పాల్గొన్నారు

