Saturday, 15 August 2026
  • Home  
  • జి.చెర్లోపల్లి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్‌ఐ బి.మహేంద్ర
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జి.చెర్లోపల్లి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్‌ఐ బి.మహేంద్ర

జి.చెర్లోపల్లి గ్రామంలో దొంగతనాల నివారణతో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉదయగిరి ఎస్‌ఐ బి.మహేంద్ర ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి గొడవలు, కొట్లాటలకు పాల్పడవద్దని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. గ్రామంలో శాంతియుత వాతావరణం కొనసాగేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్‌ఐ మహేంద్ర సూచించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన కోరారు.

జి.చెర్లోపల్లి గ్రామంలో దొంగతనాల నివారణతో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉదయగిరి ఎస్‌ఐ బి.మహేంద్ర ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి గొడవలు, కొట్లాటలకు పాల్పడవద్దని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. గ్రామంలో శాంతియుత వాతావరణం కొనసాగేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్‌ఐ మహేంద్ర సూచించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.