కాకినాడలో బీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో దళిత బహుజన మహిళలు మరియు పిల్లలకు సంబంధించిన చట్టాలు, పరిష్కార యంత్రాంగం మరియు సాధారణ కేసుల రకాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీమాబాయి మహిళా మండలి కమ్యూనిటీ ఆర్గనైజర్ ఎం నూకలక్ష్మి మాట్లాడుతూ చట్టాలను క్షుణ్ణంగా తెలుసుకోవడం ద్వారానే న్యాయాన్ని త్వరితగతిన పొందగలుగుతారని అన్నారు. ఈ సందర్భంగా మహిళలు మరియు పిల్లలకు సంబంధించిన చట్టాల గురించి వివరించారు.గృహహింస చట్టం,బాల్యవివాహాల నిరోధక చట్టం,వరకట్న నిరోధక చట్టం,పోక్సో చట్టం గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు పాల్గొన్నారు.

చట్టాలను క్షుణ్ణంగా తెలుసుకోవడం ద్వారానే న్యాయాన్ని త్వరితగతిన పొందగలుగుతారు
కాకినాడలో బీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో దళిత బహుజన మహిళలు మరియు పిల్లలకు సంబంధించిన చట్టాలు, పరిష్కార యంత్రాంగం మరియు సాధారణ కేసుల రకాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీమాబాయి మహిళా మండలి కమ్యూనిటీ ఆర్గనైజర్ ఎం నూకలక్ష్మి మాట్లాడుతూ చట్టాలను క్షుణ్ణంగా తెలుసుకోవడం ద్వారానే న్యాయాన్ని త్వరితగతిన పొందగలుగుతారని అన్నారు. ఈ సందర్భంగా మహిళలు మరియు పిల్లలకు సంబంధించిన చట్టాల గురించి వివరించారు.గృహహింస చట్టం,బాల్యవివాహాల నిరోధక చట్టం,వరకట్న నిరోధక చట్టం,పోక్సో చట్టం గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు పాల్గొన్నారు.

